కూంబింగ్ ఆపండి… ఆయుధాలు వ‌దిలేస్తాం..

Sensational decision of Maoist party: వ‌రుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాటుల నేప‌థ్యంలో మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. త‌మ ఆయుధాలు వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే కొన్ని ష‌ర‌తులు పెట్టారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు. మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు ఈ మూడు రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్ లేఖ రాశారు.

మూడు రాష్ట్రాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే బస్వరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామని వెల్ల‌డించారు. ఎప్పటి నుంచి కూంబింగ్‌ ఆపరేషన్‌ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని స్పష్టం చేశారు. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు ఇస్తున్నామ‌ని తెలిపారు. CCM సతీష్ దాదా తర్వాత, మరొక CCM కామ్రేడ్ చంద్రన్న (లొంగిపోయారు) ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.

మేము, MMC స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాసం, నూతన మార్గం ప్రణాళిక అంగీకరించాలని అనుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామ‌ని…. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున, మేము సమష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుందని వెల్ల‌డించారు. మా సహచరులను సంప్రదించి, మా పద్దతి ప్రకారం వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి సమయం కావాలన్నారు. అందుకే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామ‌ని చెప్పారు.

నన్ను నమ్మండి.. ఇంత సమయం అడగడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశం లేదని తెలిపారు. ఒకరితో ఒకరు త్వరగా సంభాషించడానికి మాకు వేరే సులభమైన మార్గాలు లేవని, ఇది చాలా సమయం పడుతుందని చెప్పారు. ఇది కొంచెం ఎక్కువ అని మాకు తెలుసున‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే PLGA వారంలో వారు ఎటువంటి కార్యకలాపాలను కూడా నిర్వహించకూడదు. వారు ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను కూడా ఆపాలి. ఇన్‌పుట్‌లు లేదా సమాచారం ఆధారంగా దళాలను నియమించాలి. ఈసారి మేము PLGA వారోత్సవాన్ని జరుపుకోబోమని, మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా మేము మీకు హామీ ఇస్తున్నామ‌ని లేఖ‌లో పేర్కొన్నారు. రెండు వైపుల నుంచి ఇటువంటి ప్రయత్నాలతో మాత్రమే మెరుగైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like