స‌ర్పంచ్‌ సీటు కోసం.. త‌ల్లీ కూతుళ్ల మ‌ధ్య పోటీ

Competition between mother and daughter for the sarpanch seat:రాజ‌కీయాల్లో బంధుత్వాలు ప‌నికిరావ‌ని అంద‌రూ అంటారు… అక్ష‌రాల అది నిజ‌మ‌ని నిరూపిస్తున్నారు ఈ త‌ల్లీ కూతుళ్లు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి పంచాయతీకి తల్లీకూతుళ్లు పోటీ పడుతున్నారు. మాజీ సర్పంచి శివరాత్రి రాజిరెడ్డి భార్య గంగవ్వ, వీరి కుమార్తె సుమలత ఇద్ద‌రూ నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఈ పంచాయ‌తీ స‌ర్పంచ్ బీసీ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ చేశారు. గంగ‌వ్వ‌కు బీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇస్తుండ‌గా, సుమ‌ల‌తకు కాంగ్రెస్ స‌పోర్టు చేస్తోంది.

సుమ‌ల‌త 2017లో అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవు. మొన్న‌టి వ‌ర‌కు సుమ‌ల‌త తండ్రి రాజిరెడ్డి స‌ర్పంచ్‌గా ప‌నిచేశారు. ఈ గ్రామంలో మొత్తం 506 ఓట్లు ఉండ‌గా, ఎనిమిది వార్డులు ఉన్నాయి. మొత్తం న‌లుగురు నామినేష‌న్లు వేయ‌గా, ప్ర‌ధానంగా పోటీ మాత్రం త‌ల్లీకూతుళ్ల మ‌ధ్యే నెల‌కొంది. దీంతో సర్పంచ్ పదవికి వీరిద్దరూ నామినేషన్లు వేయడం ఆసక్తికరంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like