ఏసీబీ వ‌ల‌లో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

ACB Attack: ఇందిర‌మ్మ ఇల్లు బిల్లు కోసం లంచం డిమాండ్ చేసిన ఓ అధికారి ఏసీబీ(ACB) వ‌ల‌లో చిక్కాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్ కుమార్ ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇప్పించేందుకు రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. అంత ఇవ్వ‌లేన‌ని రూ . 5 వేలు ఇస్తాన‌ని చెప్పిన లబ్ధిదారుడు ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. దీంతో బెల్లంప‌ల్లి కాంటా చౌరస్తా వద్ద ఏసీబీ అధికారులు వ‌ల ప‌న్ని ప‌ట్టుకున్నారు. ఎవ‌రైనా అధికారులు లంచం కోసం డిమాండ్ చేస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని ఏసీబీ డీఎస్పీ మధు వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like