గూడెంలో కేటీఆర్ ప్రత్యేక పూజలు
మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందచేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ తదితరులు పాల్గొన్నారు.