కార్మికుల సొంత ఇంటి పథకం అమలు చేయండి
-కేసీఆర్ ఇచ్చిన కార్మికులకు ఇచ్చిన హామీలను నేవవేర్చాలి
-నల్గొండ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నల్గొండ జిల్లా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. దీక్షను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సొంత ఇంటి పథకం వెంటనే అమలు చేయాలన్నారు. ప్రస్తుతం కార్మికులు నివసిస్తున్న సింగరేణి క్వార్టర్లను శాశ్వతంగా వారికే కేటాయించాలని కోరారు. అన్యాక్రాంతమవుతున్న సింగరేణి ఖాళీ స్థలాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. బినామీ పేర్ల మార్పు, డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ విషయంలో వయస్సు పెంపు వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు, వారి ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు.