144 సెక్షన్ సడలింపు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ ఘటన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ సడలించినట్లు కలెక్టర్ వెంకటేష్ దోత్రే
తెలిపారు. వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగల నేపథ్యంలో నిత్యవసరాల కోసం ఉదయం 8నుండి 11గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి 7 గంటల వరకు సడలింపు ఉంటుందన్నారు. ఈ ఘటన నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను జైనూర్, కెరమెరి, సిర్పూర్ (యు), లింగాపూర్, వాంకిడి, తిర్యాణి మండలాలు మినహా మిగతా ప్రాంతాల్లో అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకొని మత సామరస్యంతో శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కలెక్టర్ కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like