సమ్మిరెడ్డి మృతి బాధాకరం

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సమ్మిరెడ్డి ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకుడి నుంచి సుదీర్ఘకాలం పనిచేస్తూ కాంగ్రెస్లో అంచలంచెలుగా ఎదిగారని ఆయన మృతి పార్టీకి, నాయకులకు కార్యకర్తలకు తీరని లోటు అని చెప్పారు. సమ్మిరెడ్డి మృతి పట్ల వెలిచాల రాజేందర్ రావు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సమ్మిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబమనోధైర్యం కల్పించాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నట్లు వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like