పోస్టుమెన్‌పై ఎంపీడీవో ఆగ్ర‌హం

ల‌బ్ధిదారుల‌కు పెన్ష‌న్ పంపిణీ ఎందుకు స‌క్ర‌మంగా చేయ‌డం లేదంటూ MPDO శ్రీనివాస్ పోస్టుమెన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్షిప్‌లో నూత‌నంగా రోడ్లు వేస్తున్నారు. ఈ ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు ఎంపీడీవో మాదారం టౌన్‌షిప్‌కు వ‌చ్చారు. ఆ ప‌నుల‌ను చూస్తుండ‌గా పోస్టుమెన్ ఇంటి ద‌గ్గ‌ర ప‌లువురు పెన్ష‌న్ కోసం వేచి ఉండ‌టం చూసి మీరు ఇక్క‌డ ఎందుకు ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. త‌మ‌కు పెన్ష‌న్ ఇస్తాన‌ని పోస్టుమెన్ చెప్ప‌డంతో ఉద‌యం 9 గంట‌ల నుంచి ఇక్క‌డే ఉన్నామంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చాలా సంద‌ర్భాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంటొంద‌ని చెప్ప‌డంతో ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. పోస్టాఫీస్ వెళ్లి పోస్టుమెన్ ఫారూక్‌ను నిల‌దీశారు. ఇక ముందు ఇలాంటిది జ‌రిగితే ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like