సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్ర‌హ‌రీ కూల్చివేత

Cm Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్ర‌హ‌రీని కూల్చివేశారు అధికారులు.. ఆయ‌న సొంత‌ గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆయన ఇంటి ప్రహరీ గోడను అధికారులు తొలగించారు. కొడంగల్ నియోజకవర్గంలో రూ. 8 కోట్లతో 4 కిలోమీటర్ల మేర రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు సాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని రేవంత్ ఇంటి ప్రహారిని స్థానిక ఆర్ అండ్ బీ అధికారులు అధికారులు కూల్చేశారు. కొండారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 4 కిలోమీటర్ల రోడ్డును సుమారు రూ. 8 కోట్లతో విస్తరించి పటిష్టం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.

సీఎం సొంత నియోజవర్గం కొడంగల్‌లో రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. కొడంగల్‌లో రోడ్ల విస్తరణ, నిర్మాణం కోసం భారీగా నిధులు మంజూరు అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA)ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈ పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ నుంచి చించోలి వరకు ఉన్న 110 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా దుద్యాల నుంచి చించోలి వరకు 45 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్ల హైవేగా నిర్మిస్తున్నారు. దీనికి కేంద్రం రూ. 600 కోట్లు మంజూరు చేసింది. దీనివల్ల కొడంగల్, తాండూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like