బ్రహ్మోస్ కంటే భీకరం ఈ క్షిపణి
Dhvani Missile: భారత రక్షణ వ్యవస్థలో బ్రహ్మోస్ క్షిపణి బలం అందరికీ తెలిసిందే.. పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రపంచం అంతా అబ్బురపోయేలా దాడులు చేశాం. ఇప్పటికే దాదాపు 18 దేశాలు ఆ బ్రహ్మెస్ మాకు కావాలంటూ భారత్కు విజ్ఞప్తి చేశాయి. అయితే, ఇప్పుడు భారత్ దానికంటే శక్తివంతమైన ధ్వని క్షిపణి (హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్–HGV) భారత సైన్యానికి అప్పగించనుంది. శత్రుదేశాల రక్షణ వ్యవస్థలకు దడ పుట్టించే ఈ శక్తిమాన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి చివరి పరీక్షలను పూర్తి చేసుకుని, ఆర్మీకి అందుబాటులోకి రానుంది. రక్షణ వ్యవస్థలో డీఆర్డీఓ నిరంతరం అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే హైపర్ సోనిక్ మిస్సైల్స్ ప్రయోగాలను వేగవంతం చేసింది. ధ్వని క్షిపణి అత్యంత వేగంగా ప్రయాణించడం, సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగలగడం దీని ప్రధాన ప్రత్యేకత.
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్ అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో హైపర్సోనిక్ క్షిపణి (Hypersonic Missile) ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఇందులోభాగంగా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV) ‘ధ్వని (Dhvani)’ పరీక్షలు పూర్తి కావొచ్చాయి. ఈ ఏడాది చివరికల్లా పూర్తి భారత్ సైన్యానికి అప్పగించనున్నారు. ఆపరేషన్ సిందూర్లో దడ పుట్టించిన బ్రహ్మోస్ (BrahMos) కంటే ఈ క్షిపణులు భీకరంగా పనిచేస్తాయని అంచనా వేస్తున్నారు.
డీఆర్డీఓ సిద్ధం చేస్తోన్న ఈ హెచ్జీవీ ‘ధ్వని (Dhvani)’ గంటకు 7 వేల కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లేలా రూపొందించారు. 1500 నుంచి 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. వేగంతో పాటు దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు స్పందించే సమయం కూడా ఇవ్వదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు భిన్నంగా ఈ నూతన గ్లైడ్ వెహికల్ ఉంటుంది. రాకెట్ సాయంతో అత్యంత ఎత్తుకు వెళ్లి అక్కడ నుంచి విడిపోయి హైపర్సోనిక్ వేగంతో లక్ష్యంవైపు దూసుకెళ్తుంది. ఇప్పటికే ఎయిర్ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, థర్మల్ మేనేజ్మెంట్, స్క్రామ్జెట్ ఇంజిన్ పనితీరు, గైడెన్స్ వ్యవస్థకు సంబంధించి క్షేత్రస్థాయి, వైమానిక పరీక్షలు పూర్తయ్యాయి.