ఫ్లాష్.. ఫ్లాష్.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

లంచం తీసుకుంటూ ఓ ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా నర్మెట ఎస్ఐ రవికుమార్ ఒక కేసు విషయంలో రూ.25 వేలు డిమాండ్ చేసాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈ రోజు రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి ఎస్ఐ రవి కుమార్ అడ్డంగా దొరికిపోయారు.. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.