బాసరలో స్థానికుల ఆందోళన

నిర్మల్ జిల్లా / బాసర ఆలయంలో సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బాసర ఆలయ ఈవో కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి గ్రామ యువకులు ఆలయంలోకి వచ్చారు. ఈవో సెలవులో ఉన్నారని చెప్పడం తో యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధాన రోడ్డుపై బైఠాయించి యువకులు నిరసన తెలిపారు. విషయం తెలుసుకుని యువకుల వద్దకు చేరుకొన్న స్థానిక ఎస్సై మహేష్, ఆలయ ఏఈవో సుదర్శన్ గౌడ్ వారిని సముదాయించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని గ్రామ యువకుల డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like