రూ. 3 లక్షలకు బీటెక్ సర్టిఫికెట్..

బీటెక్ సర్టిఫికెట్ కు రూ.3 లక్షలు, బీఎస్సీ సర్టిఫికెట్ కు 1.7 లక్షలు, బీకాం సరిఫ్టికెట్ కు రూ.1.50 లక్షలు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను ల‌క్ష్యంగా చేసుకుని ఒక్కో సర్టిఫికెట్ లక్షల్లో అమ్ముతున్నారు. మధ్య ప్రదేశ్ కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ సాయంతో ఈ దందా నడుస్తోంది. ఎస్ఆర్‌కే యూనివర్సిటీ చైర్మన్ కు కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కూడా మరో ముఠా ఇలాగే దందా చేస్తోంది. దీనిని పోలీసులు ఛేదించారు.

హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. మలక్‌పేట్-ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10మంది అంతర్ రాష్ట్ర నిర్వాహకుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. .

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామ‌ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు. రెండు ముఠాలను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్నారు. ప్రతి డిగ్రీకి ఒక రేటు ఫిక్స్ చేశారు. కావాల్సిన డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి.. శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీ పెట్టాడని వెల్ల‌డించారు. టెలీకాలర్లు.. ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారని అన్నారు.

ఎస్ఆర్‌కే యూనివర్సిటీకి చెందిన 8 న‌కిలీ సర్టిఫికెట్లు, మధ్యప్రదేశ్ లోని స్వామి వివేకానంద యూనివర్సిటీకి చెందిన 24 సర్టిఫికెట్లు, ఉత్తరప్రదేశ్ కి చెందిన గ్లోకల్ యూనివర్సిటీకి చెందిన 4 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితుల నుండి రబ్బర్ స్టాంప్స్, వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సీజ్ చేశారు. ఏడుగురు విద్యార్థులను కూడా అరెస్ట్ చేశాం. హైదరాబాద్ లో మరో 5 నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాలు ఉన్నాయ‌ని, త్వరలోనే అరెస్ట్ చేస్తామ‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like