అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Farmer commits suicide due to debt:అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామానికి చెందిన సంఘ రాములు (68) అనే రైతు అప్పులు చేశాడు. ఆ అప్పుల బాధ తాళలేక తన పంట చేనులోకి వెళ్లి చేనులో ఉన్న మంచెకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ ఐ రాహుల్ గైక్వాడ్ వెల్లడించారు.