మంచిర్యాలలో ఏసీబీ ట్రాప్.. చిక్కిన కార్యదర్శి..
ACB Trapమంచిర్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. మంచిర్యాల జిల్లా కర్ణమామిడిలో ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం డబ్బుల కోసం కార్యదర్శి వెంకట స్వామి లంచం డిమాండ్ చేశారు. లక్ష 50 వేల బిల్లు కోసం లబ్ధిదారుడి వద్ద 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు. 20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అధికారులు విచారణ చేస్తున్నారు.