గని ప్రమాదంలో కార్మికుడు దుర్మరణం

మరొకరికి గాయాలు

Singareni: బొగ్గు గ‌ని ప్ర‌మాదంలో కార్మికుడు మృతి చెందిన ఘ‌ట‌న పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. రామగుండం ఏరియా జీడికే లెవ‌న్ ఇంక్లైన్ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి రెండవ షిఫ్ట్ విధులు ముగించుకునే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బొగ్గు గనిలో జె.ఎం.ఎస్ అనే ప్రైవేట్ కంపెనీలో ఆపరేటర్ గా పని చేసే కృష్ణమురారి పైకప్పు కూలి మెడపై పడింది. దీంతో అత‌ను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యల వైఫల్యంతోనే ఈ సంఘటన జరిగిందని తోటి కార్మికులు, కార్మిక నాయకులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీ కృష్ణా నగర్ కు చెందిన కృష్ణ మురారి కి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో తరలించారు. ఈ సంఘటనపై సింగరేణి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని బీఎంఎస్ రాష్ట్ర నాయకులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like