బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
![](https://naandinews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-12-at-11.55.33-750x430.jpeg)
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బెజ్జూర్ మండలం అందుగుల గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సోమిని గ్రామానికి చెందిన కోరెత మోహన్ (20) అనే యువకుడు మృతి చెందాడు. బైక్ పై ఉన్న అతను పక్కనే ఉన్న బండరాళ్లపై పడడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య, 9నెలల కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.