బొగ్గు గనిలో ప్రమాదం.. ఊపిరాడక 16 మంది మృతి

చైనాలో బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటన సోమవారం తెల్లవారుజూమున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని సాంగ్‌జౌ బొగ్గు గనిలో చోటుచేసుకుంది. చైనా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న చోఘింగ్‌ ఎనర్జీ సంస్థ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. నైరుతి చైనాలో ఉన్న ఈ బొగ్గు గనిలో కన్వేయర్‌ బెల్ట్‌ కాలిపోవడంతో పెద్ద ఎత్తున కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలైంది. దీంతో గనిలో పనిచేస్తున్న 16 మంది ఊపిరాడక మృతి చెందారని చైనా అధికారిక వార్తా సంస్థ జింగ్వా పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గిజియాంగ్‌ జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. 75 మంది సహాయక సిబ్బంది, 30 మంది వైద్యులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

చైనా బొగ్గు గనుల్లో ప్రమాదాల సాధారణంగా మారాయి. గత డిసెంబర్‌లో జరిగిన ఓ బొగ్గుగనిలో గ్యాస్‌ పేలుడు జరిగి 14 మంది మృతి చెందారు. 2018 డిసెంబర్‌లో ఇదే చోఘింగ్‌ ఎనర్జీ సంస్థలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అదే ఏడాది అక్టోబర్‌లో షాన్‌డోంగ్‌ జిల్లాలో జరిగిన మరో బొగ్గు గని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు విడిచారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like