అమ్మ‌కానికి విషం… అమెజాన్‌పై కేసు న‌మోదు

ఇప్ప‌టికే వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతున్న ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మ‌రో వివాదానికి వేదికైంది. ఇటీవల అమెజాన్ వేదికగా గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీనిపై విమర్శలు వస్తున్నాయి. అమెజాన్ పై తాజాగా మరో కేసు నమోదైంది. ఆన్ లైన్ లో విషం అమ్ముతోందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పోలీసులను ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతున్నఇండోర్ లో 18ఏళ్ల బాలుడు అమెజాన్ ద్వారా విషం కొనుగోలు చేసి దాన్ని సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పై చర్యలకు శ్రీకారం చుట్టింది. బాలుడి తల్లిదండ్రులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని హోంమంత్రి మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో అమెజాన్ నిర్వాహకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించినట్లు నరోత్తమ్ మిశ్రా గురువారం ఇండోర్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు.నవంబర్ 16న భింద్ జిల్లా పోలీసులు ఆన్ లైన్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు కేసు నమోదైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like