అవగాహనతోనే వ్యాధులు దూరం
![](https://naandinews.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-18-at-1.19.38-PM-750x430.jpeg)
ప్రజలకు అవగాహనతోనే వ్యాధులు దూరం అవుతాయని వైద్యాధికారి మానస స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా డీఎంఅండ్హెచ్వో సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం మందమర్రి మండలం మేడారంలో ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. వర్షాకాలం సీజన్లో ప్రధానంగా డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశాలుంటాయని తెలిపారు. కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు, కోడిగుడ్డు పెంకులు, మొక్కల తొట్లు, వృథాగా ఉన్న టైర్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. ఇళ్ల వద్ద నీటి పాత్రలు, ఎయిర్కూలర్లు, డ్రమ్ములు తదితరానలు పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలని మానస కోరారు. పరిసరాలు, వ్యక్తిగత శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం కవిత, ఆశా వర్కర్ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.