బాస‌ర ట్రిపుల్ ఐటీకి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై

విద్యార్థుల‌కు ఇచ్చిన మాట మేర‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై బాస‌ర ట్రిపుల్ ఐటీకి రానున్నారు. ఆమె ఈ రోజు రాత్రి హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరి వ‌స్తారు. రేపు (ఆదివారం) ఉదయం విద్యార్థుల‌తో స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు. విద్యార్థుల‌తోనే క‌లిసి ఆమె టిఫిన్ చేయ‌నున్నారు. బుధ‌వారం తెలంగాణ‌లోని ప‌లు యూనివ‌ర్సిటీల‌కు చెందిన విద్యార్థులు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సైని క‌లిశారు. బాస‌ర యూనివర్సిటీలో ఉన్న సమస్యలు విద్యార్థులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వర్శిటీలను సందర్శిస్తానని గవర్నర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

గ‌వ‌ర్న‌ర్ రాత్రి హైద‌రాబాద్ నుంచి రామేశ్వరం-ఓకా(16733) రైలు ద్వారా నిజామాబాద్ చేరుకుంటారు. రేపు ఉద‌యం బాస‌ర విద్యార్థుల‌ను క‌లిసి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తారు. వారితో క‌లిసి అల్పాహారం చేయ‌నున్న గ‌వ‌ర్న‌ర్ త‌ర్వాత తిరిగి హైద‌రాబాద్ వెళ్ల‌నున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like