బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గా గంగాధర్
![](https://naandinews.com/wp-content/uploads/2022/06/IMG_1654533324395-750x430.jpg)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో భీమ్ గల్ కమిషనర్ గా పనిచేస్తున్న గోపు గంగాధర్ రానున్నారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గా పని చేసిన జంపాల రజిత కమిషనరేట్ లో రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.