ఫ్లాష్.. ఫ్లాష్..బీజేపీ ఎమ్మెల్యే ల సస్పెన్షన్

అసెంబ్లీలో నిరసన చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ చేస్తున్న స్పీకర్ పోచారం ప్రకటించారు. సమావేశం ప్రారంభం నుంచే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. నల్ల కండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. బడ్జెట్ ప్రసంగం జరుగుతుండగా నిరసనలు కొనసాగుతుండటం, బడ్జెట్ ప్రతులను చింపివేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ను సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నందున అసెంబ్లీ చట్టాల ప్రకారం వారిని సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని ప్రతిపాదించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగానికి కొనసాగిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like