పేలుళ్ల కుట్ర కేసు.. పాతబస్తీకి చెందిన కలీమ్ అరెస్ట్

Hyderabad: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు జాహీద్‌కు ఆర్ధిక సాయం చేసిన అబ్ధుల్ కలీమ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురిని అరెస్టు చేయ‌గా, తాజా అరెస్టుతో ఆ సంఖ్య ఐదుకు పెరిగింది.

నిందితుడు జాహీద్‌కు అబ్దుల్ కలీమ్ రూ.40 లక్షలు సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కలీమ్ ఇచ్చిన రూ.40 లక్షలతో జాహీద్ కార్లు, బైకులు కొనుగోలు చేశాడు. జాహీద్ ముఠా హ్యాండ్ గ్ర‌నేడ్ల‌తో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాల్లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. గతంలోనే ఈ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ పేలుళ్ల కుట్రపై ఎన్‌ఐఏ విచారణ చేపడుతోంది.

హైదరాబాద్‌లో నరమేధం సృష్టించేందుకు అబ్ధుల్ జాహీద్, మహ్మద్ సమియుద్దీన్, మాస్ హసన్ ఫారూఖ్ అనే ముగ్గురు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అయితే ఈ కుట్రను పోలీసులు ముందే భగ్నం చేశారు. హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆఫీసులను పేల్చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కీలక నిందితుడిగా ఉన్న జాహీద్‌కు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉండగా.. పాకిస్తాన్ నుంచి అతడికి నిధులు అందినట్లు గుర్తించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like