బూటుతో కొట్టి బుద్ది చెప్పింది

-త‌న‌ను వేధించిన టీబీజీకేఎస్ నేత‌కు చిత‌క‌బాదిన మ‌హిళ‌
-పిట్ సెక్ర‌ట‌రీ స్వామిదాస్‌ను తొల‌గిస్తున్నాం : టీబీజీకేఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల

మంచిర్యాల : త‌న‌ను వేధింపుల‌కు గురి చేస్తున్న తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌కు ఓ మ‌హిళా కార్మికురాలు బూటుతో బుద్ది చెప్పింది. కొద్ది రోజులుగా ఈ వివాదం కొన‌సాగుతోంది. దీంతో గురువారం ఉద‌యం షిప్టులో వేధింపులకు గురైన మహిళ బూటు కాళ్లతో తన్ని కార్మికుల సమక్షంలో దేహశుద్ధి చేసి చెప్పు దెబ్బలు కొట్టింది. టీబీజీకేఎస్ ఏరియా వర్క్ షాప్ పిట్ సెక్రటరీ స్వామిదాస్ కొద్ది రోజులుగా ఓ మ‌హిళ‌కు అస‌భ్యంగా మెసేజ్‌లు పంపిస్తున్నాడు. అంతేకాకుండా త‌న‌ను ఇబ్బందుల‌కు సైతం గురిచేస్తున్నాడు. దీంతో ఆ మ‌హిళ అంద‌రి ముందు దేహ‌శుద్ది చేసింది. మహిళను వేధిస్తున్న ఫిట్ సెక్రెటరీ స్వామి దాసు పై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సి ఐ టి యు,ఐ ఎన్ టి ఎస్ సి హెచ్ ఎం ఎస్, ఏఐటీయూసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

స్వామిదాస్‌ను తొల‌గిస్తున్నం : మిర్యాల రాజిరెడ్డి
టీబీజీకేఎస్ పిట్ సెక్ర‌ట‌రీ స్వామిదాస్‌ను తొల‌గిస్తున్న‌ట్లు తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇలాంటి వ్య‌క్తుల‌ను తాము స‌హించ‌మ‌ని వెల్ల‌డించారు. ఇక‌ముందు ఏ నాయ‌కుడు, కార్య‌క‌ర్త కానీ ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డితే శిక్షిస్తామ‌న్నారు. త‌క్ష‌ణమే పిట్ సెక్ర‌ట‌రీ బాధ్య‌త‌ల నుంచి తొల‌గిస్తున్నామ‌న్నారు. మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌ల గురించి దీనిపైన పూర్తి విచార‌ణ చేసి శాశ్వ‌తంగా బ‌హిష్క‌రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like