బీఆర్ఎస్ క‌లిసి రాక‌పోతే ఒంట‌రి పోరు..

-అవ‌స‌ర‌మైతే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ
-సీపీఐ రాష్ట కార్యదర్శి కూనం నేని సాంబశివరావు

BRS-CPI: త‌మ‌తో బీఆర్ఎస్ పార్టీ క‌లిసిరాకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకే సిద్ధ‌మేన‌ని సీపీఐ రాష్ట కార్యదర్శి కూనం నేని సాంబశివరావు స్ప‌ష్టం చేశారు. మహబూబాబాద్ సీపీఐ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని అనుకున్నాయ‌ని తెలిపారు. అయితే, కేసీఆర్ దానికి సిద్ధంగా లేరని అనిపిస్తోంద‌ని, ఒకవేళ బీఅర్ఎస్ పార్టీ కలిసి రాకపోతే మేమే ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, పార్టీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నా పార్టీ అధినేత కేసీఆర్ తలుపులు మూసుకొని కూర్చుంటున్నారని విమర్శించారు.

అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. తలుపులు బిగించుకునే కూర్చు నే బదులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని చూచించారు. కర్ణాటక ఎన్నికలతో బీజేపీకి గుణపాఠం వచ్చిందని, బీజేపీకి వ్యతిరేకంగా నడిచే ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యం అని థర్డ్ ఫ్రాంట్ అనే విషయాన్ని రాజకీయ పార్టీలు మానుకోవాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like