చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది
![](https://naandinews.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-07-at-6.08.32-PM-750x430.jpeg)
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఓ అమ్మాయి పై దాడి చేసిన యువకుడికి స్ధానికులు దేహశుద్ది చేసారు. చెన్నూర్ పట్టణంలోని గాంధీచౌక్ లో బట్టల దుకాణం లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న భాగ్య అనే అమ్మాయిని రాత్రి 8 గంటల ప్రాంతంలో షాప్ క్లోజ్ చేస్తున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ గా చెప్పుకుంటున్న చెన్నూరి సందీప్ అనే వ్యక్తి అమ్మాయి వెనక నుంచి దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ప్రతిఘటించగా అనుచరులతో కలిసి అక్కడినుంచి తపించుకు పారిపోయాడు. మరలా అర్ధరాత్రి ఒంటి గంటకు ఆమె నివసిస్తున్న ఇంటి దగ్గరికి వచ్చి ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నం చేయగా భాగ్య తండ్రి, ఆమె తమ్ముడు అడ్డుకుని అతడికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు. ఆమె చెప్పుతో కొట్టి తగిన బుద్ది చెప్పింది.