కాంగ్రెస్ నేతలకు ప్యాకెట్ మనీ కింద రూ. 1000 కోట్లు

BJP Telangana chief Bandi Sanjay: కాంగ్రెస్ నేతలకు ప్యాకెట్ మనీ కింద ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ.1000 కోట్లు ఇచ్చాడని బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నది ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి వనరులు కేసీఆర్ ద్వారానే సమకూరుతున్నాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా త‌మ పార్టీ బలహీనంగా ఉందనిపిస్తే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ లేపుతున్నాడని, ఆ పార్టీ అభ్యర్థులకు డబ్బులు సమకూరుస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంఐఎం, బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మూడు ఒకటేనన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసు ఇంకా తేలలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ సాగుతోందన్నారు. ఆ కేసులో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే కాపాడాలని సీఎం కేసీఆర్ ఎవ‌రి కాళ్లు పట్టుకొని బతిమిలాడినా వదిలిపెట్టరని బండి స్ప‌ష్టం చేశారు. ఈడీ ఒక స్వతంత్ర సంస్థ అని బీజేపీతో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. ఆ సంస్థ పూర్తి విచారణ అనంతరం దోషులను తేలుస్తుందన్నారు. ఆ కేసుతో కవితకు సంబంధం ఉన్నట్లు తేలితే జైలుకు పంపడం ఖాయమ‌న్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సంబంధం లేకపోతే ఆమె తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కర్ణాటకలో జేడిఎస్ నేత కుమారస్వామిని సీఎం కేసీఆర్ మోసగించాడని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఏర్పాటు సమయంలో కుమారస్వామిని వాడుకున్నాడని ఇప్పుడు ఆయ‌న‌ ఫోన్ కూడా కేసీఆర్ ఎత్తడం లేదన్నారు. కర్ణాటకలో తమ పార్టీకి ఓట్ల శాతం లో ఏమాత్రం బలం తగ్గలేదన్నారు బండి సంజ‌య్‌. అక్కడ ఎంఐఎం, కాంగ్రెస్, మరో పార్టీ ఒక్కటై ఎన్నికల్లో పోటీ చేశాయ‌ని స్ప‌ష్టం చేశారు. అందువల్లనే అనేక సీట్లలో స్వల్పమెజార్టీతో తమ పార్టీ ఓటమి పాలయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like