ఇద్ద‌రు కానిస్టేబుళ్ల స‌స్పెన్ష‌న్

పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్ల‌ను సస్పెండ్ చేస్తున్న‌ట్లు రామ‌గుండం క‌మిష‌న‌ర్ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. బెల్లంపల్లి ఏఆర్ కానిస్టేబుల్ ఎస్. తిరుపతి-901, మంచిర్యాల టౌన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆర్. శ్రీకాంత్ పిసి-372 స‌స్పెండ్ చేశారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణగా ప‌నిచేయాల‌న్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు త‌ప్ప‌ద‌ని క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like