క్రికెట్ టోర్నీ విజేత బోయపల్లి జట్టు
తాండూరు మండలంలో నిర్వహించి క్రికెట్ పోటీల్లో బోయపల్లి జట్టు విజయం సాధించింది. దాదాపు 15 రోజుల పాటు జరిగిన పోటీల్లో 38 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఫైనల్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఫైనల్లో బోయపల్లి టీం, చౌటపల్లి టీంలు తలపడ్డాయి. ఈ పోటీల్లో విజేతకు రూ. 20,000, రన్నరప్కు రూ. 10,000 నగదు అందించారు. ఈ పోటీల్లో మ్యాన్ ఆఫ్ది మాచ్గా నిలిచిన మాసాడి సాయికిరణ్ను పలువురు అభినందించారు.