దళిత యువకుడికి.. మూత్రం కలిపిన మ‌ద్యం తాగించి..!

దళిత యువకుడిపై మ‌రో ఇద్ద‌రు యువ‌కులు అమానవీయంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌ద్యం తాగేందుకు నిరాక‌రించాడ‌ని.. దళిత యువకుడి చేతులు కట్టేసి.. మూత్రం కలిపిన బీరును తాగించారు. అనంత‌రం ఆ దళిత యువకుడిని తీవ్రంగా కొట్టి.. అతడి వద్దనున్న డ‌బ్బును లాక్కొని పారిపోయారు.

హర్యానా లోని రేవారీలోని భైరాంపుర్ భడాగ్ని గ్రామానికి చెందిన దళిత యువకుడు మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి ప‌ట్ట‌ణానికి వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తుషార్, రోహిత్ అనే యువ‌కులు ఆ దళిత యువకుడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం.. తమతో కలిసి మ‌ద్యం సేవించాల‌ని ఒత్తిడి చేశారు.

ఆ యువకుడు నిరాకరించడంతో చేతులు కట్టేసి, దాడికి పాల్ప‌డ్డారు. తాగిన మైకంలో విచ‌క్ష‌ణ మ‌రిచి.. బీరులో మూత్రం పోసి తాగించారు. దీంతో ఆ యువకుడు వాంతి చేసుకున్నారు. తీవ్రంగా కొట్టి అతడి వద్దనున్న డబ్బులు, మొబైల్ ఫోన్​ను లాక్కొని పారిపోయారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆ యువ‌కుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గ్రామ‌స్థుల స‌హ‌యంతో ఆ యువకుడు బవాల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం.. రేవారీ హాస్పిటల్ కి త‌ర‌లించారు.

బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like