ద‌ళితుల‌ను రాజుల‌ను చేసేందుకే ద‌ళిత‌బంధు

ద‌ళితులను రాజుల‌ను చేసేందుకే ద‌ళిత‌బంధు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టార‌ని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య స్ప‌ష్టం చేశారు. భీమిని మండలం లో 16 మంది లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను ఆదివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశంలో ఒక చరిత్ర అన్నారు. అందరూ దళితుల ఓట్లతో గెలిచారు కానీ వారిని ఎవరూ పట్టించుకోలేదన్నారు. దళితులను ధనవంతులను చేయాలని.. రాజులు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చారని చెప్పారు. దళితుల సాధికారత కోసమే దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రుపొందించిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని సాధించాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like