ద‌ళితులు ఆర్థికంగా ఎద‌గాలి..

దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం తీసుకువచ్చారని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య అన్నారు. ఆదివారం కన్నెపల్లి మండలం చెర్లపల్లిలో దళితబంధు పథకంపైన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయ‌న మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికోసం ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళితులు త‌మ కాళ్ల‌పైనిల‌బ‌డేందుకు ఈ ప‌థ‌కం ఎంత‌గానో దోహ‌దం చేస్తుంద‌ని అన్నారు. గ‌త ప్ర‌భుత్వాలు ద‌ళితుల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే చూశాయ‌న్నారు. అందుకే ఈ ప‌థ‌కం కింద ద‌ళితుల‌కు ముఖ్య‌మంత్రి ఉచితంగా ప‌ది ల‌క్ష‌లు అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ప‌థ‌కం దేశంలోనే కాకుండా, ప్ర‌పంచ‌లో ఎక్క‌డా లేద‌న్నారు. లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం వాహనాలపైనే ఆసక్తి చూపెట్టకుండా రైస్ మిల్లులు, సెంట్రింగ్, హార్డ్ వేర్, మెడికల్ దుకాణాలు వంటి యూనిట్లు స్థాపించి లాభాలు పొంది ఆర్థికంగా బలపడాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like