ఎకరాకు రూ. 20 వేల నష్టపరిహారం చెల్లించాలి
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్
![](https://naandinews.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-13-at-3.32.36-PM-750x430.jpeg)
వరద నీటితో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారాన్నివ్వాలని ఆదిలాబాద్ MP సోయం బాపురావ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో పర్యటించిన ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. జలమయమైన కాలనీలు, ఇళ్ళలోకి వరదనీరొచ్చి ఇబ్బందులు పడుతున్న బాధితులతో మాట్లాడారు.. వారికి ధైర్యం చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు చేపడ్తామన్నారు.. ఈ సందర్భంగా సోయం బాపురావ్ మాట్లాడుతూ… రోడ్డు నిర్మాణ సమయంలో జాగ్రత్త చర్యలు పాటించనందునే రోడ్డు కొట్టుకుపోయాయని అన్నారు. ఇక పంటలన్నీ నీటమునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలన్నారు.. వరద నీటితో నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ. 20 వఏల నష్టపరిహారమిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.