ప్రాణం తీసిన ఫ్యాన్స్ గొడ‌వ‌

పవన్ కళ్యాణ్ అభిమానిని కొట్టి చంపిన ప్రభాస్ అభిమాని

Prabhas-Pawan Kalyan: సినీహీరోలపై ఉన్న పిచ్చి అభిమానం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇద్దరు స్టార్ హీరోలకు చెందిన అభిమానుల మధ్య జరిగిన గొడవ ఈ హత్యకు దారితీసింది. ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో జరిగింది. ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ భవనాలకు రంగులు వేసే కార్మికులుగా కలిసి పని చేస్తున్నారు. వీరిలో హరికుమార్ ఏలూరు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ. ఇక కిషోర్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్.

హరికుమార్ తన మొబైల్ స్టేటస్‌లో ప్రభాస్ వీడియోలను పెట్టుకున్నాడు. వీటిని చూసిన కిషోర్.. ప్రభాస్ వీడియోలు కాకుండా పవన్ కళ్యాణ్ వీడియోలు పెట్టుకోవాలని హరికుమార్‌ను ఒత్తిడి చేశారు. అప్పటికే వారిద్దరు మద్యం సేవించి వుండటంతో వారి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఆగ్రహించిన హరికుమార్ పక్కనే ఉన్న సెంట్రింగ్ కర్రతో కిషోర్ కుమార్ తలపై గట్టిగా కొట్టడంతో కిందపడిపోయాడు. ఆ తర్వాత బండరాయిని తీసుకుని కిషోర్ ముఖంపై బలంగా మోదడంతో అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హరికుమార్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like