కోర‌మాండ‌ల్ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం

Coromandel International Limited: కోరమాండల్ ఎరువుల సంస్థ ఆధ్వర్యంలో శుక్ర‌వారం ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించారు. కరీంనగర్ రైల్వే గూడ్‌షెడ్‌లో నిర్వ‌హించిన శిబిరాన్ని కోరమాండల్ రీజినల్ లాజిస్టిక్స్ మేనేజర్ VVN శేషుకుమార్, కంపెనీ సీనియర్ జోనల్ మేనేజర్ సజన్ కుమార్ క‌లిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వి.వి.ఎన్ శేషుకుమార్ మాట్లాడుతూ హమాలీలు, వారి కుటుంబాల శ్రేయస్సు పట్ల శ్రద్ధ వహించడమే హెల్త్ క్యాంప్ ముఖ్య ఉద్దేశమన్నారు.

ఈ శిబిరంలో సాధారణ వైద్య చికిత్స, బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌, బ్లడ్‌ ప్రెజర్‌, కంటి పరీక్షలను నిర్వ‌హించారు. వైద్యులు మనోజ్, శ్రావణి చికిత్స నిర్వహించి మందులు, మాత్రలు ఉచితంగా అందించారు. దాదాపు 200 మంది హమాలీలు, లారీ యజమానులు, డ్రైవర్లు ప‌లువురు గ్రామస్తులు శిబిరంలో ఆరోగ్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకున్నారు. కార్యక్రమంలో కరీంనగర్ మార్కెటింగ్ అధికారులు రాజేష్, సురేష్ అవాజ్, లిమిటెడ్ మేనేజర్ సురేష్, డీలర్లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like