గర్భంలో శిశువుతో సహా మహిళ మృతి
![](https://naandinews.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-20-at-11.29.58-AM-750x430.jpeg)
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోని రిమ్స్లో గర్భంలో ఉన్న శిశువుతో సహా ఓ మహిళ మృతి చెందింది. శిశువు మృతికి వైద్యులే కారణమని బంధువులు ఆందోళన చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడకు చెందిన గర్భిణీ అక్షిత 22 నొప్పులు రావడంతో రిమ్స్లో చేరారు. కడుపులో శిశువుతో సహా మహిళ మృతి చెందింది. తల్లి,గర్భంలోని శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో న్యాయం చేయాలని రిమ్స్ ముందర బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన నిర్వహిస్తున్నారు. బాధితులకు బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ సంఘీభావం తెలిపారు.