ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు
![](https://naandinews.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-23-at-8.18.39-AM-750x430.jpeg)
మంచిర్యాల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, కార్యాలయాల వద్ద ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే 1 ఇంక్లైన్లో ఉదయం జెండా ఆవిష్కరణ చేశారు. మేనేజర్ లక్ష్మీనారాయణ పతాకావిష్కరణ చేయగా, కార్యక్రమంలో ఎస్వో రమేష్, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ ప్రభాకర్, టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.