తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

Tirumala: భ‌క్తుల కోసం టీటీడీ మ‌రో కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్వోలో లక్కీడిప్‌లో సేవా టికెట్లు పొందిన భక్తులకు “పే లింక్” ద్వారా ఎస్ఎంఎస్ పంపే విధానాన్ని ప్రారంభిస్తోంది. ఇకపై భక్తులు కౌంటర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. త్వరలో బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. భక్తుల సౌకర్యం కోసం టీటీడీ ఈ నూతన విధానాన్ని తీసుకొస్తోంది.

తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. “పే లింక్” ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు. సీఆర్‌వోలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది.

ఇప్పుడు టీటీడీ నిర్ణయంతో.. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్‌ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like