కార్మిక వ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను క‌లిసి తిప్పికొడ‌దాం

మంచిర్యాల : కేంద్రం అవ‌లంభిస్తున్న కార్మిక వ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను క‌లిసి తిప్పికొడ‌దామ‌ని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా అబ్బాపూర్ గ‌ని వద్ద మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన గేట్ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేంద్రం సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తోంద‌న్నారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పొట్టకొట్టడానికి సిద్ధమైందని దుయ్య‌బ‌ట్టారు. ఈ కార్మిక వ్యతిరేక చర్యలను కార్మికులంతా కలసి ఏకమై ఉద్యమించాల‌న్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలన్నారు. ఈ ఉద్యమంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులమైన తాము కూడా భాగస్వామ్యం అవుతామన్నారు. బుధ‌వారం బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో జరిగే నిరాహార దీక్షకు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అందరూ హాజరై విజయవంతం చేసి మన ఐక్యతను ఢిల్లీ వరకు చాటిచెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు మాల్రాజు శ్రీనివాసరావు, సింగ‌రేణి చ‌ర్చ‌ల క‌మిటీ ప్ర‌తినిధి ధరావత్ మంగిలాల్, మెరుగు రమేష్, అన్నం లక్ష్మయ్య, రాజేశం, గురిజాల రమేశ్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like