కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడు

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్

తెలంగాణ రైతులను టీఆఎర్ఎస్ సర్కార్ గందరగోళానికి గురి చేస్తుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగళవారం పీయూష్ గోయల్ తో రాష్ట్ర బీజేపీ నేతలు స‌మావేశం అయ్యారు. ఈ భేటీ అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఢిల్లీలో లేని సమయంలో తెలంగాణ మంత్రులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అన్నారు.

తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ ఐదు రెట్లు పెంచామ‌ని చెప్పారు. గత రబీలో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు ఒప్పందం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. ఇప్పటికే నాలుగు సార్తు గడువును పొడగించామ‌న్నారు. ఇప్పటికీ 14 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్, 13 లక్షల టన్నుల రారైస్ తెలంగాణ ఇవ్వాల్సి ఉంద‌న్నారు. తెలంగాణకు స్పెషల్ కేస్ కింద 20 లక్షల మెట్రిక్ టన్నులు బాయిల్ రైస్ కు అనుమతించామ‌ని కేంద్ర‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ అబద్దాలు చెబుతుందని దుయ్య‌బ‌ట్టారు. ఖరీఫ్ ఎంత రా రైస్ ఇచ్చినా తీసుకుంటామని ఎన్నోసార్లు చెప్పామ‌న్నారు. ఐదేళ్లలో కొనాల్సిన ధాన్యం కంటే మూడు రెట్లు ఎక్కువ కొన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. నాలుగేళ్లకు సరిపడ బాయిల్డ్ రైస్ ఉన్నా.. తెలంగాణ నుంచి బియ్యం తీసుకుంటామని చెప్పామ‌న్నారు. భవిష్యత్ లో బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్ సంతకం చేశారన్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

 

 

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like