ఫ్లాష్.. ఫ్లాష్.. ఖైదీ ఆచూకీ లభ్యం

కుమ్రంభీం ఆసిఫాబాద్ : అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ నుండి పరారైన ఖైదీ ఆచూకీ లభ్యం అయ్యింది. కుమ్రం రాజేష్ (38) అనే ఖైదీ ఉదయం జైల్ నుండి పరారు అయ్యాడు. రౌటసంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మెంగుబాయి గూడ గ్రామానికి చెందిన రాజేష్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు. ఈ రోజు ఉదయం 6.30 సమయంలో ఖైదీలు జైల్ ఆవరణ లోని పిచ్చి మొక్కలు తొగిస్తున్నారు. ఇదే అదునుగా భావించి రాజేష్ పరారయ్యాడు. ఉదయం నుండి అతని కోసం గాలిస్తున్న పోలీసులకు అతని ఆచూకీ దొరికింది. అతన్ని తిరిగి జైలుకు తరలిస్తున్నట్లు జైల్ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like