వరద బాధితులకు సింగరేణి సాయం

ముఖ్యమంత్రికి రూ.10.25 కోట్ల చెక్కు అందజేత

తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి అధికారులు, ఉద్యోగులు ఒకరోజు బేసిక్ జీతం రూ. 10.25 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కు గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. వరదల్లో తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలకు తోడ్పాటుగా ఈ వితరణ ప్రకటించామని, గతంలో కూడా పలు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విరాళాలు అందజేశామని పేర్కొన్నారు.

సింగరేణి ఉద్యోగులు, అధికారులు తమ ఒకరోజు బేసిక్ వేతనాన్ని వరద బాధితుల కోసం విరాళంగా అందజేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, అధికారుల సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, లక్ష్మీపతి గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ త్యాగరాజన్, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ నర్సింహులు, జీఎం(కోఆర్డినేషన్) సుభాని, జీఎం (పర్సనల్) కవితా నాయుడు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like