భార్యను బ్రిడ్జిపై నుంచి తోసేసి హత్య
Wife murdered by being pushed off a bridge:జాతీయరహదారికి చెందిన బ్రిడ్జిపై నుంచి తోసేసి భార్యను హత్య చేశాడో భర్త.. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగన్నాథం రజిత(26) అనే మహిళను భర్త కుమారస్వామి నస్పూర్ మండల కేంద్రం ఉన్న జాతీయ రహదారిపై బ్రిడ్జి పై నుంచి తోసేశాడు. దీంతో రజిత కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. కుటుంబ కలహాల వల్లనే ఈ ఘటన జరిగిందని, భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న నస్పూర్ పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.