ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
Rangareddy Bus Accident :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 23 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించడం విషాదాన్ని నింపింది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్లో చదువుతున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో సొంతూరుకు వచ్చారు. తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి ముగ్గురూ మృత్యువాతపడ్డారు.