లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ACB Trap:లంచం తీసుకుంటుండగా ఓ సీనియర్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో కటకం విద్యాసాగర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఓ రైతు సాదాబైనామా ద్వారా 8.35 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి రూ.రెండు లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుంగా.. ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేసి, అతడిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ DSP మధు మీడియాకు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.