తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న ర‌ద్దీ… స‌ర్వద‌ర్శ‌నానికి 18 గంట‌లు

Tirumala News:కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. తిరుమల కొండపై ఎటు చూసినా ‘గోవింద’ నామస్మరణతో మారుమోగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అందించిన తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ (SSD) టోకెన్లు ఉన్న భక్తులకు 3 నుండి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.

రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. నిన్న స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,085 కాగా, స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,832, హుండీ ఆదాయం ₹3.78 కోట్లని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like