మంచిర్యాల జిల్లాలో ఏసీబీ దాడులు

ACB Raids:మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో కొ దాడులు నిర్వ‌హించారు. కార్యాలయంలో కొంత కాలంగా జరుగుతున్న అవకతవకలు, క్యాష్ బుక్ లో అప్ టు డేట్ వేయకుండా నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ అధికారులు నిర్దారించారు. జిల్లాకు మంజూరైన వికలాంగుల వాహనాలు పంపిణీ విషయంలో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఉన్న‌తాధికారుల‌కు పంపిస్తామ‌ని ఏసీబీ అధికారులు వెల్ల‌డించారు.

You might also like