తెల్లవారుఝామున ఆర్టీసీ బస్సు ప్రమాదం
RTC bus accident:తెల్లవారుఝామున ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, అందులో ఒక్క ఏకైక ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మందమర్రి టోల్ గేట్ సమీపంలో ఉదయం 4 గంటల సమయంలో బస్సు బోల్తా పడింది. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, బస్సులో ఉన్న ఏకైక ప్రయాణికుడు సురక్షితంగా బయటపడ్డాడు. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.