పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి
మంచిర్యాల జిల్లాలో పేకాట రాయుళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. టాస్క్ఫోర్స్ బృందం ఆకస్మికంగా నిర్వహించిన దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని భారీ మొత్తంలో నగదు, వాహనాలు స్వాధీనం చేసుకుంది.
రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ టీమ్, టాస్క్ఫోర్స్ బృందం శనివారం సాయంత్రం విశ్వసనీయ సమాచారం మేరకు మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేములపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేపట్టింది. దాడి సమయంలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.1,02,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులతో కలిసి తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.